మృతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన కడియం శ్రీహరి
జఫర్గడ్ (ఆగస్టు 23) తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పర్యటనలో భాగంగా జఫర్గడ్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తీగారం గ్రామానికి చెందిన జిట్టబోయిన మల్లయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తదుపరి తమ్మడపల్లి (జీ) గ్రామంలో ఎన్టీవీ రిపోర్టర్ కొత్త రంజిత్ తండ్రి కొత్త వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, డాక్టర్లు సూచించినవిధంగా మందులు వేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
అదే గ్రామానికి చెందిన వేల్పుల సోమ నర్సమ్మ, గాజుల సంపత్, సోన్నాయిల ఎల్లయ్య, పందిబోయిన సోమయ్య మరణించగా, వారి కుటుంబాలను కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కడియం శ్రీహరి సామాజిక సేవా కార్యక్రమాన్ని అభినందించారు.


Comments