ప్రజావాణి దరఖాస్తుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

-- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

ప్రజావాణి దరఖాస్తుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఐడిఓసి ప్రజావాణి హాల్లో వనపర్తి జిల్లా అదనపు లోకల్ బాడీస్ కలెక్టర్ సంచిత్ గంగు వార్, మరియు వనపర్తి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ఎం. నాగేష్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు71 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రసంగిస్తూ వివిధ శాఖల అధికారులు ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటం పై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారునికి. సమాచారం ఇవ్వాలని సూచించారు. చిత్రంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. వనపర్తి జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగు వార్. వనపర్తి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ఎం. నాగేష్. వనపర్తి జిల్లా మీడియా పౌర సమాచార అధికారి సీతారాం నాయక్. కలెక్టర్ సిసి శ్రీకాంత్. అదునపు రెవిన్యూ కలెక్టర్ సిసి రహీం ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .