జెకె కాలనీలో ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులు త్వరలో ప్రారంభం.

కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటన

జెకె కాలనీలో ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులు త్వరలో ప్రారంభం.

మల్కాజిగిరి, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి గురువారం పర్యటించారు. కాలనీ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “జెకె కాలనీలో ప్రతి వర్షాకాలం సమయంలో డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలసి రోడ్లలోకి, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎన్నేళ్లుగా స్థానికులు మన ముందు ఉంచుతున్నారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి రూ.80 లక్షల వ్యయంతో ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులు చేపడుతున్నాం” అని తెలిపారు. కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, “ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు వేగంగా ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాక కాలనీ నీటమునిగే పరిస్థితి ఉండదు. కాలనీ ప్రజలు సౌకర్యంగా జీవించేందుకు మున్సిపల్ శాఖ పూర్తి సహకారం అందిస్తుంది” అని పేర్కొన్నారు.WhatsApp Image 2025-10-09 at 9.04.34 PMఈ సందర్భంగా డీఈ లౌక్య, ఏఈ నవీన్, సూపర్‌వైజర్లు సాగర్, వెంకటేష్, బీజేపీ నాయకులు సాయి సురేష్, జగదీష్ చారి, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కార్పొరేటర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తమ సమస్యలను పరిష్కరించేందుకు చూపుతున్న కృషిని అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .