హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు త్వరలో ప్రారంభం

ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా హామీ

హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు త్వరలో ప్రారంభం

నాచారం, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం పరిధిలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా హామీ ఇచ్చారు.హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విస్తృతంగా పెరిగి చెరువు పరిసర ప్రాంతాల్లో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతున్న విషయాన్ని ఇదివరకే జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను కలిసి గుర్రపు డెక్క తొలగింపుకు సంబంధించిన మరిన్ని వివరాలను విన్నవించారు.ఈ సందర్భంగా కాప్రా సర్కిల్‌కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో, దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. అలాగే మిగిలి ఉన్న గుర్రపు డెక్కను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత సంవత్సరం మెయింటెనెన్స్ కాంట్రాక్టు ముగిసినందున, కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి చెరువు సంరక్షణ పనులను పకడ్బందీగా చేపట్టాలని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జోనల్ కమిషనర్‌ను కోరారు.ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, త్వరలోనే గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .