మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు
Views: 48
On
పెద్దమందడి,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన కాసింగారి చంద్రయ్య భార్య కాసింగారి వెంకటమ్మ ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. వెంకటయ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు బీఆర్ఎస్ నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతురాలి కుటుంబానికి రూ.5,000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే భవిష్యత్తులో కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తమవంతు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.
విషాద సమయంలో అండగా నిలిచిన సర్పంచ్ మరియు బీఆర్ఎస్ నాయకుల మానవీయతను గ్రామస్తులు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments