స్పైసీ బావర్చి రెస్టారెంట్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభం
నాగారం, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఆర్టీసీ కాలనీలో కొత్తగా స్థాపించిన స్పైసీ బావర్చి రెస్టారెంట్ ను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, "ప్రజల టేస్ట్ మరియు ఇష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఉత్తమ నాణ్యమైన భోజనం అందించడం మా ముఖ్య లక్ష్యం" అని తెలిపారు.
రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి, మాజీ వైస్ చైర్మన్మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు సరితా రమేష్, నాగేష్ గౌడ్, గోక యాదగిరి, లక్ష్మీ వేణుగోపాల్, అనంతరెడ్డి, మోకు జగన్మోహన్ రెడ్డి, కొమురెల్లి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అంజయ్య గౌడ్, పెంటయ్య గౌడ్, మచ్చా శ్రీనివాస్ గౌడ్, నర్సింహారెడ్డి, సాయినాథ్ గౌడ్, రామ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, హరికృష్ణ, శబ్బుఖాన్, వాహిద్ బెజగం, నవీన్, ఆంజనేయులు మరియు రెస్టారెంట్ ప్రొప్రైటర్ షేర్ అలీ ఖాన్, వారి తనయుడు రిజ్వాన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కొత్త రెస్టారెంట్ ద్వారా స్థానికులు సాంప్రదాయ వంటకాలు మరియు ఆధునిక రుచులను అనుభవించగలరు అని అధికారులు పేర్కొన్నారు.


Comments