ఆగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే 

 ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో వెంకటాచారి

ఆగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే 

వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు: 

ఖిల్ల ఘనపూర్ మండలం ఎంపీడీవో వెంకటాచార్య ఆధ్వర్యంలో ఆగరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల సర్వేను  నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులను గుర్తించి వివరాలను పరిశీలించారు. అధికారులతో కలిసి మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్ పాల్గొని లబ్ధిదారులు ఉంటున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించి అర్హులని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షలు అందజేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి  ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుండి వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటాచారి, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్, మండల కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్, బాలు, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .