భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

నాచారం, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని నాచారం ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాచారం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో వాసవి మాత విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చరిత్రను పఠించి ఆమె త్యాగాన్ని స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం అధ్యక్షుడు శ్రీరామ్ సత్యనారాయణ (బండల), గౌరవ అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు రమేష్ గుప్తా, కోశాధికారి భాస్కర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వాసవి మాత ఆదర్శాలు నేటి సమాజానికి మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .