రాష్ట్రంలో కార్పొరేటర్ స్థాయి విద్య భోధన అందిస్తున్నాం
ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
రాష్ట్రంలో
ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేటర్ స్థాయి విద్య భోధన అందిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేత్రూత్వంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కాజీపేట 63వ డివిజన్ బిసి బాలుర వసతి గృహం, వసతి గృహలలో రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలలో పెంచిన 40 ఛార్జీలను అమలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశ్రమ పాఠశాలను భోజన శాల, తరగతి గదులను తనిఖీలు చేసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత ప్రమాణమైన విద్య, పౌష్టిక భోజన సదుపాయం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు.ఉన్నత ప్రమాణాలతో కార్పొరేటర్ స్థాయి విద్య భోధన అందిస్తున్నామని చెప్పారు.ప్రతిపక్షాల ఉచ్చులో ఆశ్రమ పాఠశాల సిబ్బంది పాడుకుడదని తెలిపారు.గతం గంటే నేడు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు స్కూల్ ప్రిన్సిపల్ హాస్టల్లో వార్డెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments