యువత వ్యాపార రంగాల్లో రాణించాలి
శ్రీ మల్లికార్జున ఆటోమొబైల్స్ ప్రారంభం
-మాజీ ఉపముఖ్యమంత్రి,
తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్:
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో జఫర్ఘడ్ మండల మాజీ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నాయిని నరేష్ గౌడ్ ఏర్పాటు చేసిన శ్రీ మల్లికార్జున ఆటోమొబైల్స్ నూతన షాప్ను తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు స్వయంఉద్యోగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాచర్ల గణేష్,మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్,యూత్ నియోజకవర్గ అధ్యక్షులు మారపల్లి ప్రసాద్,నాయకులు చిరంజీవి నాయక్,ఎర్ర అశోక్, గుండె మల్లేష్,ఆరూరి రవిచందర్,
రాజారపు సుమన్,పట్ల రమేష్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


Comments