ప్రభుత్వ భూమి అక్రమణకు గురి కావద్దు
-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మూడో విడత రుణమాఫీ పై సమీక్ష సమావేశం
రుణమాఫీ పొందని రైతులందరికీ ఈ మూడో విడుదల వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి
రుణమాఫీ కి సంబంధించిన రైతుల యొక్క వివరాలు బ్యాంకర్లు సిద్ధం చేయాలి
చెరువు శిఖం భూములకు బౌండరీలు ఏర్పాటు చేయాలి
వివాదంలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీలో పలు కారణాలతో చెల్లింపులు జరుగని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి రైతులతో శాసనసభ్యులు కడియం శ్రీహరి బ్యాంక్ అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షణ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...మూడో విడత రుణమాఫీ లోపే సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, చెరువులోని శిఖం భూములకు కూడా బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు నిర్మించ తలపెట్టినందున అధికారులు అందుకు అనువైన స్థలాలను గుర్తించాలని అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భవనాలకు స్థలాలను కేటాయింపు చేయాలన్నారు.
స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలో పార్కు మోడల్ మార్కెట్ నిర్మాణాలకు స్థలం కేటాయించాలన్నారు. కోర్టు కేసులలో ఉన్న భూముల సమస్యలను కూడా పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు.
ఈ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు కొమరయ్య, వెంకన్న జిల్లా అధికారులు, బ్యాంక్ప్రభుత్వ భూమి అక్రమణ గురి కాకుండా చూడాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మూడో విడత రుణమాఫీ పై సమీక్ష సమావేశం
రుణమాఫీ పొందని రైతులందరికీ ఈ మూడో విడుదల వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి
రుణమాఫీ కి సంబంధించిన రైతుల యొక్క వివరాలు బ్యాంకర్లు సిద్ధం చేయాలి
చెరువు శిఖం భూములకు బౌండరీలు ఏర్పాటు చేయాలి
వివాదంలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీలో పలు కారణాలతో చెల్లింపులు జరుగని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి రైతులతో శాసనసభ్యులు కడియం శ్రీహరి బ్యాంక్ అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షణ సమీక్షించారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...మూడో విడత రుణమాఫీ లోపే సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, చెరువులోని శిఖం భూములకు కూడా బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు నిర్మించ తలపెట్టినందున అధికారులు అందుకు అనువైన స్థలాలను గుర్తించాలని అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భవనాలకు స్థలాలను కేటాయింపు చేయాలన్నారు.
స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలో పార్కు మోడల్ మార్కెట్ నిర్మాణాలకు స్థలం కేటాయించాలన్నారు. కోర్టు కేసులలో ఉన్న భూముల సమస్యలను కూడా పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు.
ఈ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు కొమరయ్య, వెంకన్న జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అధికారులు, రైతులు పాల్గొన్నారు.


Comments