భాగస్వామ్య పింఛను పథకంను రద్దు చేయాలి
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
భాగస్వామ్య పింఛన్ పథకంను రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేసేలా పాలకులకు బుద్ధి ప్రసాదించాలని దైవాన్ని వేడుకున్నట్లు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యూనైటెడ్ ఫ్రంట్ ,ఎన్ఓపిఆర్ యూ , ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కురువపురం దత్తక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 16న యుపిఎస్ ,ఎన్పీఎస్ ల రద్దు కోరుతూ, కొత్త ఢిల్లీలో జరుప తలపెట్టిన భారీ సదస్సు విజయవంతం కోసం శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. న్యూ స్కీం రద్దు చేసే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రధాని కార్యాలయం వరకు గలం వినిపించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, సన్నాహక సమావేశంలో తమ తమ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం కూడా తమ పోరాటానికి అవసరమని భావించి ఆదివారం దత్తాత్రేయ స్వామిని వారిని దర్శించుకున్నట్లు తెలిపారు.


Comments