ప్రజావాణిలో 126 ఫిర్యాదులు స్వీకరణ 

వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

ప్రజావాణిలో 126 ఫిర్యాదులు స్వీకరణ 

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ హరిప్రియ, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిలతో కలిసి ఆమె సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొత్తం 126 ఫిర్యాదులు అందాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల జిల్లా అధికారులు పరిశీలించి, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ ప్రజలు సమర్పిస్తున్న వినతులపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అన్నారు. చేపట్టిన ప్రతి చర్యను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత శాఖలు వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.సిఎంఓ ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని ఆమె సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20251124-WA0063

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .