అమిత్ షా పదవికి వెంటనే రాజీనామ చేయాలి

మాల మహానాడు మండల అధ్యక్షుడు పోతురాజు ప్రభాకర్

అమిత్ షా పదవికి వెంటనే రాజీనామ చేయాలి

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా పార్లమెంటు లో డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల మహానాడు అధ్యక్షుడు పోతురాజు ప్రభాకర్ అద్యక్షతన హసన్ పర్తి బస్టాండ్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాల మహానాడు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ పార్లమెంటు లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా పై ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజు చుక్క ప్రభాకర్, పోతురాజు మల్లికార్జున్, కనకం మనోహర్,పోతురాజు జ్ఞానేశ్వర్,,పోతురాజు నగేష్,గరిగె రాజు,గరిగె వేణు,,పోతురాజు కుమారస్వామి,,పోతురాజు రాజు,కనకం వంశీ,గిద్ద స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .