గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానం
గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Views: 20
On
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గోడపత్రికను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను గురుకులాల్లో చేర్పించేందుకు ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చేరి ఉన్నత భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, రీజనల్ కోఆర్డినేటర్ గంగరామ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ రాయ్, కౌడిపల్లి పాఠశాల ప్రిన్సిపల్ ఫణి కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments