పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో జాగ్రత్తలపై అవగాహన
జిల్లా కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ను ఈ నెల 22వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.చెర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) స్మార్ట్ టెర్మినల్ (హైదరాబాద్ టెర్మినల్), సర్వే నెం. 183, ఫేజ్–III, మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మాక్ ఎక్సర్సైజ్ జరగనుందని పేర్కొన్నారు.పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, ప్రాణనష్టం తగ్గించేందుకు అవసరమైన చర్యలు, అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు.మాక్ డ్రిల్ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని, ఇందుకు ఐఓసీఎల్ యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ మాక్ డ్రిల్ ద్వారా విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.


Comments