సింగరేణిలో శ్రామిక చట్టాలపై అవగాహన.!
జె.వి.ఆర్ ఓసీ–2లో నూతన కోడ్ల వివరణ.
సత్తుపల్లి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో సింగరేణి కంపెనీ జె.వి.ఆర్ ఓసీ–2లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శ్రామిక చట్టాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. బేస్ పనిముట్లశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో డీడీఎంఎస్ నాగుల్ మీరా, ప్రాంత ప్రధాన నిర్వాహకులు చింతల శ్రీనివాస్ పాల్గొని ఉద్యోగులకు నూతన శ్రామిక కోడ్ల అంశాలను వివరించారు.
వేతనాల కోడ్–2019, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, సామాజిక భద్రత కోడ్–2020, వృత్తి భద్రత–ఆరోగ్యం–పని పరిస్థితుల కోడ్–2020 వంటి నాలుగు ప్రధాన చట్టాల లక్ష్యాలు, వాటి అమలు విధానం, ఉద్యోగులకు వాటి ద్వారా లభించే ప్రయోజనాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ సంస్కరణలతో కార్మిక నిబంధనలు సులభతరం కావడంతో పాటు కార్మిక సంక్షేమం మెరుగుపడుతుందని, పారిశ్రామిక రంగ బలోపేతానికి కూడా ఇవి దోహదం చేస్తాయని దక్షిణ మధ్య మండల గనుల భద్రత ఉప మహాసంచాలకులు అభిప్రాయపడ్డారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను మెరుగైన రూపంలో మార్చడమే కొత్త కోడ్ల ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జె.వి.ఆర్ ఓసీ–2 ప్రాజెక్టు అధికారి ఎన్వీఆర్ ప్రహ్లాద్, ప్రాజెక్టు ఇంజినీర్ డి. శ్రీనివాసరావు, ఎస్.ఓ.ఎం. బి. రాజేశ్వరరావు, సంక్షేమ అధికారి కె. శ్రీనివాస్, ఐఎన్టీ
యూసీ నాయకుడు ఎన్. రామారావు (పిట్ కార్యదర్శి), ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి సుధాకర్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments