టిప్పర్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
ఎల్కతుర్తి, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని డిబిఎల్ రోడ్వర్క్స్ కంపెనీ పి.ఆర్వో ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, ఎస్సై అక్కెనపెల్లి ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డ్రైవర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ — ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను కలిగి ఉండాలని, నిర్ణీత యూనిఫారం ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్స్పీడ్, ఓవర్లోడ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. వాహనాల సురక్షిత ప్రయాణం అత్యంత ముఖ్యం అని పేర్కొన్నారు..jpeg)
అలాగే, ఎలాంటి అప్రమత్త పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డిబిఎల్ సంస్థ ఉద్యోగులు, టిప్పర్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments