సత్తుపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.!

మహిళలతో కలిసి ఆడిపాడారు, ఎమ్మెల్యే రాగమయి – దయానంద్ దంపతులు. 

సత్తుపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.!

సత్తుపల్లి, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ దంపతులు కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వేలాది మంది మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొన్నదని మట్టా దయానంద్ పేర్కొన్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, స్థానిక అధికారులు, కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.WhatsApp Image 2025-09-24 at 7.50.28 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .