కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ర్యాలీ
చిలుకానగర్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పండుగ బతుకమ్మ సంబరాల సందర్భంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు చిలుకానగర్ డివిజన్ మహిళలు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యం వహించారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల ప్రకారం ఈ ర్యాలీ నిర్వహించబడింది..jpeg)
ఈ సందర్భంగా కార్పొరేటర్ గీత ప్రవీణ్ మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రత్యేక ఉత్సవం. ఈ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కే.సి.ఆర్. దే. నేడు బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు” అని తెలిపారు.కార్యక్రమంలో డివిజన్ మహిళా నాయకురాళ్లు, బిఆర్ఎస్ కార్యకర్తలు, వందలాది మహిళలు పాల్గొని బతుకమ్మ పాటలతో, రంగురంగుల బతుకమ్మలతో ఉత్సవాలను సందడిగా మార్చారు.


Comments