జవహర్ నగర్‌లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ

జవహర్ నగర్‌లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ

జవహర్ నగర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (ఐపీఎస్) ఆదేశాల మేరకు, పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జవహర్ నగర్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైరింగ్ కట్ట వరకు కొనసాగి, మార్గమంతా పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం నినాదాలు, జాతీయ జెండాలతో కదిలింది. విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జవహర్ నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య మాట్లాడుతూ “రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగం స్ఫూర్తిదాయకం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అన్నారు.ర్యాలీలో ఎస్సైలు ఇద్రిస్ అలీ, రాము నాయక్, వేణుమాధవ్, మౌనికతో పాటు జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .