ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి ఘోరం: రాష్ట్ర నేతల ఆవేదన.

ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి ఘోరం: రాష్ట్ర నేతల ఆవేదన.

సత్తుపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

దేశ చరిత్రలో చీకటి రోజు గా గుర్తించదగిన సందర్భంలో, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం, ధర్మం వైపు నడుస్తున్న గౌరవప్రదమైన వ్యక్తి పై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలచివేసే ఘటనగా ఉందని వారు తెలిపారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు వారిపై ప్రభావం చూపవు అని, యావత్ దేశం గుర్తించవలసిన అంశమని పేర్కొన్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి, దాడి చేసిన వ్యక్తి వెనక ఉన్న శక్తులకు తగిన బుద్ధి చెప్పి, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వారిని రక్షించడం, న్యాయ వ్యవస్థ సురక్షితంగా ఉండడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .