బాలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

 -వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

బాలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

బాలలు సోషల్ మీడియా కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని, అందుకే సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ లోని కాళోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాస్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ “బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదాం” అని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు.WhatsApp Image 2024-11-30 at 9.59.40 PM (1)

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తాయని అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపి హనుమకొండ జిల్లాలోని వివిధ సిసిఐ బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .