సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
ఎమ్మెల్యే బండారి, కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
చికిత్స ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆశ్రయం అవుతోంది. చిల్కానగర్ డివిజన్ గణేష్నగర్ నివాసులు మల్లేష్, సంధ్యలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కును చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ సోమవారం అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్, సంధ్యలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించాలని కార్పొరేటర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, చర్యల శ్రీనివాస్, శ్యామ్, బంటి తదితరులు పాల్గొన్నారు.


Comments