నీట్ పేపర్ లీక్‌పై వేలేరులో కాంగ్రెస్ ఆందోళన .

నీట్ పేపర్ లీక్‌పై వేలేరులో కాంగ్రెస్ ఆందోళన .

ప్రధాని దిష్టిబొమ్మ దహనం.. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

వేలేరు,జులై23(తెలంగాణ ముచ్చట్లు): 

నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీసీసీ, డీసీసీ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వేలేరు గ్రామ సర్పంచ్ బిల్ల యాదగిరి, మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థుల ఎన్నో సంవత్సరాల కష్టం, ఆశయాలను దెబ్బతీసిన ఈ ఘటన దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్, వేలేరు గ్రామ సర్పంచ్ బిల్ల యాదగిరి, మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్, శాలపల్లి సర్పంచ్ కూరపాటి అశోక్, ఏఎంసీ డైరెక్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి సంపత్, ఉపసర్పంచులు, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20260723-WA0019

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు. మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.
ప్రసాద్ కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సాయం అందించిన 1988–89 బ్యాచ్ మిత్రులు భీమదేవరపల్లి, జూలై 23 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం...
నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దారుణం.
కొత్తకోటలో 233వ బూత్‌కు వంద శాతం మార్కు.
నీట్ పేపర్ లీక్‌పై వేలేరులో కాంగ్రెస్ ఆందోళన .
నీట్ పేపర్ లీక్‌పై ధర్మసాగర్‌లో కాంగ్రెస్ నాయకుల నిరసన.
హుజురాబాద్‌లో సెంట్రల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం.
ఆరుతడి పంటల సాగుతో నష్టాలను నివారించండి.