కనకదుర్గ అమ్మవారిని దర్శించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
Views: 23
On
చిల్కానగర్, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు)
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా హబ్సిగూడ వేలుగుట్ట కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గీత ప్రవీణ్ మాట్లాడుతూ –
“విజయదశమి అంటే చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాల తో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.తరువాత ఆలయ కమిటీ వ్యవస్థాపక సభ్యులు గొరిగే మల్లేష్ కుటుంబ సభ్యులు కార్పొరేటర్ గీత ప్రవీణ్కు అమ్మవారి నవరాత్రి అలంకరణలో ఉపయోగించిన చీర, ప్రసాదాలను అందించి వేదపండితులతో ఆశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments