ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
Views: 15
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏబిసిడి వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి షమీం అక్తర్ను మాదిగ ప్రతినిధులు కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కాయిత బిక్షపతి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాదిగ నాయకులు, ఉపకులాల ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.వర్గీకరణలో మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, ఇతర రంగాలలో సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. మాదిగ సమాజానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ మద్దతును తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments