పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసిన ధర్మసాగర్ పోలీసులు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలంలోని మలక్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం ఆధారంగా పోలీసులు శనివారం నిర్వహించిన రైడ్లో ఎనిమిది మంది పేకాట ఆడుతుండగా, వారిలో ముగ్గురు పారిపోయారు.పోలీసులు పట్టుబడిన వారి వద్ద నుంచి 104 ప్లేయింగ్ కార్డులు, ₹11,170 నగదు, నాలుగు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడినవారు మలక్పల్లి గ్రామానికి చెందిన మానుపాటి వెంకన్న, మానుపాటి సంపత్, మానుపాటి రాజశేఖర్, కొలిపాక నాగరాజు, మడ్డి మధు. పారిపోయినవారిలో అయినవోలు మండలం కనపర్తి గ్రామానికి చెందిన నాతి చందు, ఇలా సారపు హరిప్రసాద్, మలక్పల్లి గ్రామానికి చెందిన మానుపాటి హరి ఉన్నారు.ఈ దాడిలో ఎస్ఐ జానీ పాషా, ఎస్సై నరసింహారావు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Comments