జీతాలు లేక పూట గడవక

ఆవేదన చెందుతున్న కార్మికులు

జీతాలు లేక పూట గడవక

జోగులాంబ గద్వాల్ తెలంగాణ ముచ్చట్లు

రాజోలి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ పాశుద్ధ కమిటీల పంచాయితీ కార్మికుల ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు తిప్పన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ మూడు నెలలకు అవుతున్న ఇంతవరకు కార్మికులకు వేతనాలు రావడంలేదని చాలీచాలని బ్రతుకులతో జీవనం పోషిస్తున్న కార్మికులకు జీతాలు నెల నెల వచ్చేటట్టు ఇవ్వాలని పొద్దున నుంచి సాయంత్రం వరకు గ్రామాన్ని మురికి కాలువలు శుభ్రం చేస్తూ రోడ్లు ఊడుస్తూ దుర్గంధపు వాసన లెక్క చేయకుండా అనారోగ్యాల పాలై కష్టపడి పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఇంతవరకు జీతాలు రావడం లేదని కార్మికులకు నెలనెలా జీతాలు వచ్చేటట్టుకు అధికారులు కృషి చేయాలని అలాగే తూర్పు గార్లపాడు లోని కార్మికులకు ఐదు నెలల దాటిన ఇంతవరకు వారికి వేతనాలు ఇవ్వడం లేదని దుకాణాలకు వెళితే ఉద్దర సరుకులు ఇవ్వడం లేదని దుకాణదారులు కార్మికుల నమ్మే స్థితిలో లేరని తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశుద్ధ కమిటీ గ్రామకార్యదర్శి  లక్ష్మన్న అధ్యక్షులు తిక్కన్న కోశాధికారి సత్తార్మియా సహాయ కార్యదర్శి కృష్ణ ఉపాధ్యక్షులు సౌలు రాజు కమిటీ సభ్యులు పుల్లన్న శశి రెడ్డి నరసన్న చిన్న దస్తగిరి డ్రైవర్ రవి నడిపన్న మాభూమియా పెద్ద దస్తగిరి దుబ్బన్న గార్లపాడు మద్దిలేటి కార్మికులు పాల్గొన్నారు అనంతరం ఎంపీడీవో ఖాజావలి  పంచాయతీ కార్యదర్శి కృష్ణ  వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .