హనుమాన్ నగర్లో త్వరలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ హనుమాన్ నగర్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలతో బస్తీవాసులు చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు స్థానికులు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ను విన్నవించుకున్నారు.దీనిపై స్పందించిన కార్పొరేటర్ ప్రత్యేక చొరవతో, ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ద్వారా ఏప్రిల్ నెలలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.25 లక్షల నిధులను మంజూరు చేయించారు. టెండర్ ప్రక్రియ పూర్తై, పైపులు తెప్పించే వరకు కొంత ఆలస్యం జరిగినప్పటికీ, పనులు త్వరగా ప్రారంభించేందుకు కార్పొరేటర్ కృషి ఫలించింది.డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన సందర్భంగా బస్తీవాసులు కార్పొరేటర్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నుంచి మూడు రోజుల్లో డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ పనులు పూర్తయ్యాక వెంటనే సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, సుజాత, రవి, మనోజ్, మల్లేష్, సుమిత్ర, నీలమ్మ, విజయ, దిలీప్, నజీర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments