దమ్మాయిగూడలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగింపు
దమ్మాయిగూడ,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శివానందపూర్ కాలనీలో పదకొండు రోజులపాటు నిర్వహించిన శ్రీ కనకదుర్గాదేవి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారి శోభాయమాన అలంకరణలు, శక్తి తాండవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నవరాత్రి ఉత్సవాలు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా సాగి విజయదశమి రోజున ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఆలయ కమిటీ చైర్మన్ సుప్రీత్ రెడ్డి (సినీనటుడు కాట్రాజ్), అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. కమిటీ సభ్యుల సమిష్టి సహకారంతో వేడుకలు మరింత భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా జరిగాయి.విజయదశమి సందర్భంగా ఉరేగింపు, చక్రస్నానం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించగా, అనంతరం భక్తులందరికీ మహా ప్రాసాదం పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపునకు వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు.


Comments