కొడుకు పట్టించుకోవడం లేదని, రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన తండ్రి
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం కావాలి
ఎల్కతుర్తి,అక్టోబర్15(తెలంగాణ ముచ్చట్లు):
తన కొడుకు పట్టించుకోవడం లేదని, రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–11) ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నివసిస్తున్న ఆయన మాట్లాడుతూ, తన కొడుకు రంజిత్ రెడ్డి తాను సొంతంగా సంపాదించిన ఆస్తులను లాక్కొని ఇంటి నుండి గెంటేశాడని, కూతురికి కట్నం కింద ఇచ్చిన భూమిని కూడా ఆక్రమించాడని తెలిపారు.
తన భార్య పేరిట ఉన్న భూమిని కూడా బలవంతంగా తీసుకున్నాడని, దీనిపై ప్రశ్నించగా తనపైనే దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి దానం చేయాలని నిర్ణయించినట్లు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్కు తెలిపారు.ఆ స్థలంలో తన భార్య వసంత జ్ఞాపకార్థంగా ఒక భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన, “తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానానికి ఇది గుణపాఠం కావాలి” అని అన్నారు.


Comments