నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పువ్వాడ..
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
బుధవారం నూతన సంవత్సరం సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం విచ్చేసి వారి నివాసం నందు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో వారు చేసింది ఏమి లేదని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్య పెట్టారని రైతులను,మహిళలను మోసం చేసారని హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని అన్నారు.
జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ది చెప్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనలాల్,చంద్రావతి,నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,
సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ,టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మండల అధ్యక్షులు వీరునాయక్, కార్పొరేటర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments