రెండు కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన
అబ్కారీ పర్యాటక సంస్కృతిక మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మెగారెడ్డి
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల కేంద్రం నుండి జాతీయ రహదారి 44 రోడ్డు కు 3/0-2 కి.మీ. వద్ద హై లెవెల్ వంతెన కు రూ. 2.00 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆదివారం రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును , ఏమ్మెల్యే తుడి మేఘ రెడ్డి గారిని స్థానిక నాయకులతో కలిసి వెల్టూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పెద్దమందడి మాజీ ఎంపీపీ తమ్మల రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కె. రామకృష్ణారెడ్డి, వెల్డూరు గ్రామ మాజీ సర్పంచ్ ఆర్.శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి ఎస్.మహేష్, మాజీ జడ్పీటీసీ కొమ్ము వెంకట స్వామి, మాజీ ఎంపీటీసీ లు, చింతల వెంకటయ్య, చాపల సత్యరెడ్డి, రాంచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచ్ లు, తిరుపతి రెడ్డి, బుచ్చన్న, నందిమల్ల కురుమన్న, కుర్వ బాలుచంద్రయ్య, టిఎమ్ఆర్ నాయకులు టైలర్ రవి, ముష్టి వెంకట్రాములు, ఎం.కృష్ణ చిలుకటోని పల్లె, బాలు, దిండు వివేక్ సాగర్, వడ్డే ల లక్ష్మయ్య, డీలర్ శ్రీను, వడ్డే శేఖర్, బాజా శ్రీను, కుమ్మరి కొండన్న, చందు రెడ్డి, దశరత మన్యం కొండ, తదితరులు పాల్గొన్నారు.


Comments