మోజర్లలో బిఆర్ఎస్ ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ ప్రమాణ స్వీకారం

మోజర్లలో బిఆర్ఎస్ ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ ప్రమాణ స్వీకారం

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక వార్డు సభ్యుడిగా గట్టు సతీష్ విజయం సాధించారు. మొత్తం 10 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఒక్క వార్డును బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం.నూతనంగా ఎన్నికైన సందర్భంగా గట్టు సతీష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోజర్ల గ్రామ మాజీ సర్పంచ్ సునీత తిరుపతయ్య, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి, అధికారులు గట్టు సతీష్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గట్టు సతీష్ మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వాన్ని అనుసరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలనమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. IMG-20251229-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .