పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్నదానం..
అన్నదానాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్, వైరా ఎస్సై
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ లో బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రంలో బాధితులకు శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ వేణు వైరా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాడుపడిన ఇండ్లు, కూలే ఇళ్లల్లో ఉండవద్దని పునరావాస కేంద్రానికి రావాలని తెలిపారు. వాగులు వంకలు ప్రవహిస్తున్నందున ప్రజలందరూ అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. గత రెండు మూడు రోజుల నుండి వర్షాలు భారీగా కురుస్తున్నందున మండలంలోని ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments