స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు 

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: 

తమ ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మంత్రి శ్రీధర్ బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబును భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించాలని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేశారని చెప్పారు. అనేకమంది క్రీడాకారులను తయారు చేసిన ఘనత గోపీచంద్ అకాడమీది అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు. గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. బ్యాడ్మింటన్ ప్రోత్సాహానికి కూడా తాము ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 3వ తేదీనుంచి 10వ తేదీవరకు ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరుగుతుందని వివరించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుగుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

WhatsApp Image 2025-01-03 at 10.20.13 PM

దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి గ్రోత్ ఉంది -పుల్లెల గోపి చంద్ 

దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి గ్రోత్ ఉందని.. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహిస్తామని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అండర్ 19 ఆల్ ఇండియా జూనియర్, ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్‌ మాట్లాడారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు మంత్రి శ్రీధర్ బాబు ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి కలిశామని అన్నారు. ఈరోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆల్ ఇండియా జూనియర్ ర్యాంక్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. 7వ తేదీన మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనే నిర్ణయం మంచిదని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమని చెప్పారు. క్రీడాకారులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని అన్నారు. స్పోర్ట్స్‌పై విధిస్తున్న జీఎస్టీ తీసివేస్తే బాగుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ తీసివేస్తే క్రీడాకారుల తయారీకి ప్రోత్సహించినట్లుగా ఉంటుందని పుల్లెల గోపిచంద్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .