గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు మృతి.

గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు మృతి.

 హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి  పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రేణిగుంట్ల ఐలయ్య గురువారం ప్రమాదవశాత్తు  మృతిచెందగా గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం అతని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుండి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు.WhatsApp Image 2025-08-21 at 8.20.17 PMమృతుడు ఐలయ్యకు భార్య ప్రమీల ముగ్గురు కుమార్తెలు కలరు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హరిదాస్యం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకన్న గౌడ్, కార్యదర్శి అనగాని రవీందర్, బిల్ కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతల్ల సదానందం, జిల్లా అధ్యక్షుడు తగరం శివ, మండల అధ్యక్షుడు బండి రమేష్, సాయిని శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .