టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి కృషి చేయాలని సూచన
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాo రెడ్డి సిఫారసుతో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులుగా ఎంపికైన 8 మంది.. ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్ సాహెబ్, యాస వెంకటేశ్వరరావు, పిల్లెల రామ లక్ష్మయ్య, బోదాసు కనకరాజు, అమరావాది సత్య నారాయణ రెడ్డి, బానోత్ రంజిత్ లకు నియామక పత్రాలను ఎంపీ అందజేశారు. నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ రీజియన్ లో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధి ఉంటుందని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ.. గ్రామీణ స్థాయిలో బీఎస్ఎన్ఎల్ విస్తరణకు, సంస్థ బలోపేతానికి విశేష కృషి చేయాలని అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ స్టాండింగ్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని.. మన రీజియన్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ సంస్థ విస్తరణకు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని..అభయామిచ్చారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా రాంబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బెల్లం శ్రీను, కొప్పుల చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ గోసు మధు, నాయకులు దొడ్డా నగేష్, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఉత్తేజ్ నాయక్, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments