ఉమ్మడి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా క్రిష్ణ మనోహర్ గౌడ్ నియామకం
బీసీల హక్కుల పోరాటానికి కృషి చేస్తా
- ఉమ్మడి జిల్లా అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సినియర్ జర్నలిస్ట్ క్రిష్ణ మనోహర్ గౌడ్ ని,నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెకపోతుల నరేందర్ గౌడ్ మీడియాకి తెలియచేశారు. జర్నలిస్టు గా, తెలంగాణా ఉద్యమకారుడిగా ఎన్నో అభివ్రుది సేవ కార్యక్రమాలు చేసిన క్రిష్ణ మనోహర్ గౌడ్ గారిని వారి సేవలను గుర్తించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా,బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా నియమించడం జరిగిందనీ ఇట్టి నియామకం నేటి నుంచి అమలవుతుందని ఆయన తెలిపారు. అనంతరం క్రిష్ణ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ.. బిసిలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిచేందుకు వారికి రావాల్సిన హక్కుల పై పోరాటం చేసేందుకు చక్కటి వేదిక దొరికిందని, బీసీల హక్కుల పోరాటానికి కృషి చేస్తానని నేటి నుంచి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన తను ముందు వుంటానని క్రిష్ణ మనోహర్ గౌడ్ మీడియాకి తెలియచేశారు , అదేవిధంగా తన శ్రమను గుర్తించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక పదవి ఇచ్చినా రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.


Comments