భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

కలెక్టర్ స్నేహ శబరీష్

భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

భూభారతి దరఖాస్తుల నిక్షిప్త ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి, తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. బుధవారం ఐనవోలు తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తుల ఆన్‌లైన్ పరిస్థితి, భూముల నమోదు ప్రక్రియను కలెక్టర్ సమీక్షించారు. తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ నుంచి దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, పత్రాలను పరిశీలించారు.
అనంతరం తహసీల్దార్‌, నాయబ్ తహసీల్దార్‌, రెవెన్యూ అధికులతో సమావేశమైన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రామాణికంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-30 at 8.56.34 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .