అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో ఐక్యంగా ఉద్యమిద్దాం
ఎల్లాపూర్ గ్రామఅంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎర్ర తిరుపతి
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ మేధావి నవయుగ పురుషుడు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకుందామని,మనువాధుల చేర నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకొవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎల్లాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్ర తిరుపతి పిలుపునిచ్చారు.
శుక్రవారం గ్రేటర్ వరంగల్ పరిధి 65వ డివిజన్ ఎల్లాపూర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా మహానీయుని విగ్రహానికి వద్ద కొవ్వొత్తులు వెలిగించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎర్ర తిరుపతి మాట్లాడుతూ... భారత దేశ ప్రజలకు తన ఆరోగ్యం పూర్తిగా క్షిణిస్తున్న, అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగం రూపంలో హక్కులను ప్రవేశ పెడితే కొంతమంది మనువాధ శక్తులు రాజ్యాంగాన్ని మార్చేకుట్రలు చేస్తున్నారని,భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, హక్కు లను కాపాడుకోని,
ప్రశ్నించేతత్వాన్ని పెంపోందించుకోవాలన్నారు.ఈరోజు దేశ ప్రజలందరికి చీకటి రోజని తను మరణించి రాజ్యాంగం రూపంలో మనకు వెలుగులు ప్రసాదించారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లాపూర్ అంబేద్కర్ యువజన సంఘం , ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రకాష్, ఎర్ర చేరలు, వైస్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల రాజయ్య, సాంబయ్య, బిక్షపతి, గోలి వెంకట్ రంగారెడ్డి, ఎర్ర రమేష్, మోతె మధుసూదన్ రెడ్డి, శ్రీపెల్లి సుదర్శన్,తదితరులు పాల్గొన్నారు.


Comments