అవినీతిని తరిమేద్దాం, దేశాభ్యుదయానికి పునాదులు వేద్దాం
-హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజలకు అవినీతి నిరోధక సందేశాన్ని పంపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినప్పుడు అది ఇవ్వకుండా, వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
అవినీతి నిరోధక వారోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏసీబీ కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు. ప్రజల సహకారంతో జిల్లాను అవినీతి రహితంగా మారుస్తామని, అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగస్వాములవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
అవినీతి రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని, నైతిక విలువలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ సమ్మయ్య పాల్గొని అవినీతి వ్యతిరేక చర్యలపై అవగాహన కల్పించారు.అవినీతి రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని, నైతిక విలువలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు .


Comments