విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి

విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి చెందిన మునగల శెట్టి రవి గత కొంతకాలంగా అడ్డాకుల సబ్ స్టేషన్ కాంట్రాక్టు బేసిక్ లో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విద్యుత్ మరమ్మత్తుల విషయంలో డాక్టర్ మండలం కాటవరం గ్రామంలో విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫారం బంపర్ మారుస్తూ కరెంటు షాక్ గురై మునగల శెట్టి రవి (27) మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కాటవరం గ్రామంలో కరెంటు లేకపోవడంతో ట్రాన్స్ఫారం ఫ్యూజ్ మార్చడానికి రవి సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న గట్టప్ప్ కు ఫోన్ చేసి ఎల్సి ఇవ్వాలని కోరడమైనది. ఇంతలో ఏ తప్పిదం జరిగిందో తెలియదు కానీ రవి అడిగిన గ్రామానికి కాకుండా మరో గ్రామానికి ఎల్సి ఇవ్వడంతో ప్రమాదం జరిగి విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని రవి బంధువులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .