జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టారు
మాదిగ అమరవీరులకు ఘన నివాళి
Views: 35
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
సభలో పాల్గొన్న జిల్లా నేత కలపాల యేసు మాట్లాడుతూ, జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరుల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేయాలని, వారి త్యాగాలను మరవకూడదని అన్నారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆరెంపుల సాంబయ్య, మండల అధ్యక్షుడు పింగళి నరేష్, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, కోటమర్తి బాలస్వామి, కోట వెంకటేశ్వరరావు, సుదిమళ్ల ప్రసాద్, నడ్డి రవి, మరాఠీ రాములు, కొమ్ము విజయ్, ముల్లంగి నాగరాజు, జొన్నలగడ్డ సాయి, సాధు శరత్ బాబు, సాధు రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments