గంగారం చీకటిని పారద్రోలి వెలుగులు నింపిన మధుబాబు!

సొంత ఖర్చుతో 450 వీధి దీపాలు ఏర్పాటు.

గంగారం చీకటిని పారద్రోలి వెలుగులు నింపిన మధుబాబు!

సత్తుపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, గంగారం గ్రామం అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసింది. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే మాజీ వైస్‌ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) తనయుడు దాసరి మధుమోహన్ రెడ్డి (మధుబాబు) సొంత ఖర్చుతో గ్రామమంతా 450 వీధి దీపాలను ఏర్పాటు చేసి విశేష ప్రశంసలు అందుకున్నారు.

గట్టు బజార్, చాకలి బజార్, చిన్న సెంటర్, తూర్పు బజారు, పాత హరిజనవాడ, యాదవ బజార్, నాచారం రోడ్, జలగం నగర్ 1, జలగం నగర్ 2, గురుభట్లగూడెం రోడ్, మసీదు రోడ్, ప్రకాష్ నగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి ఒక్కో స్తంభానికి లైట్లు అమర్చించారు.

వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యూత్ సభ్యులతో సర్వే చేయించాను. 450 లైట్లు అవసరమని తేలడంతో సొంత డబ్బుతోనే ఏర్పాటు చేశాను. గంగారం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటాను అని మధుబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .