యుజిడి పనులను పరిశీలించిన మహేష్ గౌడ్
చర్లపల్లి, నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధి లోని శ్రీ సాయి గణేష్ నగర్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు 19 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన యుజిడి అభివృద్ధి పనులను డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు నేమూరీ మహేష్ గౌడ్ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఇచ్చిన హామీ ప్రకారం చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. డివిజన్లో పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బిఆర్ఎస్ నాయకులు డప్పు గిరిబాబు, కనకరాజ్ గౌడ్, నర్సింహ, అనందరాజ్, రెడ్డి నాయక్, బాలరాజు, అనిల్, శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్, సాగర్ గౌడ్, రాము, వెంకటేష్,సాయిబాబా,
శేఖర్, రఘు, పాషా, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.


Comments