ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయండి

ఎమ్మార్పీఎస్ నేతలు గంగారపు శ్రీనివాస్,శాంతి సాగర్

ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయండి

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నేతలు గంగారాపు శ్రీనివాస్ మాదిగ,శాంతి సాగర్ మాదిగ పిలుపునిచ్చారు. ధర్మసాగర్ మండలంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడాలని, మాదిగలందరూ ఏకతాటిపై నిలవాలని  నాయకులు కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ఫిబ్రవరి 7న భారీ సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ వెల్లడించారు. సోంపల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ, శాంతి సాగర్ మాదిగ పాల్గొన్నారు.

మండలంలోని ఎస్సీ, బీసీ కాలనీలలోని డప్పు కళాకారులతో కలిసి లక్ష డప్పుల తోపుతో సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా ఎస్సీ వర్గీకరణను తక్షణం అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.మాదిగల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని వారంతా పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అనుబంధ సంఘాల నేతలు చిలుక రాజు మాదిగ, కొట్టే కళ్యాణ్ మాదిగ, మాచర్ల బాబు మాదిగ, రాహుల్ మాదిగ, బొడ్డు రణధీర్, కనకం జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .