జాతీయ క్రీడాకారుడు రోహిత్ ను అభినందించిన మల్లిబాబు యాదవ్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కామేపల్లి మండలం ..
పండి తాపురం గ్రామానికి చెందిన వంగివరపు రోహిత్ శర్మ గత సంవత్సరం డిసెంబర్ 27నుండి 30వ తారీకు వరకు జరిగిన ఉత్తరప్రదేశ్, మధుర లో టెన్నిస్ క్రికెట్ అండర్ 19, జాతీయ పోటీలలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచినందుకు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రత్యేకంగా అభినందినించారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూక్రీడల వలన మానసికో ల్లాసము , ఆరోగ్యంతో పాటు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, ఈరోజులలో పోటీలో గెలవడం అంటే మాములు విషయం కాదని, క్రమశిక్షణ, ప్రతిభ ఉంటేనే తప్పసాధ్యపడదని, ఒక మామూలు సాధారణ పూజారి కుమారుడు ఆ స్థాయికి ఎదగటం చాలా గొప్ప విషయమని, ప్రతి విద్యార్థి స్ఫూర్తి గా తీసుకొని రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బానోతునరసింనాయక్,శీలపుల్లయ్య.భూక్యనాగేంద్రబాబు,పాటిబండ్లప్రసాదు బద్దలశేఖర్రబ్బానీపాషా,అంబటిపూడివెంకటయ్య,రాయలనాగశంకర్,అంబడిపూడవెంకటేశ్వర్లు,సీతారామాంజనేయశర్మ, మేకల లక్ష్మీనారాయణ, మల్లికార్జున్ తిరపయ్య మరియు తదితరులు పాల్గొన్నారు


Comments