ఎంబిబిఎస్ సీటు సాధించిన మనీషాకు ఘన సత్కారం
Views: 36
On
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 22, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయానికి చెందిన విద్యార్థిని గార్లపాటి మనీషా తొలి రౌండ్ లోనే ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. మనీషా శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థి కావటంతో పాఠశాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను శాలువా, మెమెంటో తో ఘనంగా సత్కరించారు. ఆమె మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ సూచించారు. ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థినికి ప్రభుత్వ కళాశాలలో మొదటి కౌన్సిలింగ్ లోనే ఉచిత సీటు లభించటం గర్వకారణమన్నారు. వైద్య విద్యలో రాణించి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని బోడేపూడి కిరణ్ సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు రేణుక, పార్వతి, సురేష్, కిరణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments